ద.కొరియాకు షాకిచ్చిన కిమ్: సైనిక కవాతు నిర్వహించిన ఉ.కొరియా
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య ఇటీవల కాలంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. శాంతి జపాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ పాటిస్తున్నాడు. అయితే దక్షిణ కొరియాలో వింటర్ ఒలంపిక్స్ తమ దేశ ప్రతినిధులను కూడ పంపారు. దక్షిణకొరియాలో వింటర్ ఒలంపిక్స్ కు రంగం సిద్దం చేసుకొంటున్న సమయంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సైనిక కవాతును నిర్వహించాడు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్న జనవరి 1వ, తేదిన దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించారు. రెండు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలంపిక్స్కు ప్రతినిధులను పంపుతామని చెప్పినట్టుగానే ఉత్తరకొరియా నుండి ప్రతినిదులను కూడ కిమ్ పంపారు. దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలంపిక్స్కు తన సోదరిని కూడ కిమ్ జంగ్ ఉన్ పంపాడు.












Click it and Unblock the Notifications