అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్
ప్యాంగ్యాంగ్: వాన్నా క్రై ర్యాన్సమ్వేర్ సైబర్ దాడికి ఉత్తరకొరియా పాల్పడిందనే ఆరోపణలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది.తమ దేశంపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది.
వాన్నా క్రై ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడికి ఉత్తరకొరియా పూనుకొందని అమెరికాకు చెందిన ఓ మీడియాలో కథనం వెలువడింది. ఈ విషయమై వైట్ హౌజ్ కూడ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనంపై ఉత్తరకొరియా తీవ్రంగా మండిపడింది. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఉత్తరకొరియా తీవ్రంగా అమెరికాపై మండిపడింది. ఈ తరహ పద్దతులకు స్వస్తి పలకాలని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది.

వాన్నాక్రై ర్యాన్సమ్వేర్కు సంబంధం లేదు
వాన్నాక్రై ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది. తమపై నిందారోపణలను మానుకోవాలని అమెరికాకు సూచించింది. కుట్రపూరితంగానే తమ దేశంపై అమెరికా ఆరోపణలు చేస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటా
వాన్నాక్రై ర్యాన్సమ్ వేర్ దాడులకు తాము పాల్పడ్డామని అమెరికా చేసిన ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని ఉత్తరకొరియా అభిప్రాయపడింది. తమ దేశంపై బురదచల్లేందుకే అమెరికా ఈ తరహ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తరకొరియా ఆరోపణలు చేసింది.

ప్రతీకార చర్యలకు వెనుకాడం
తప్పుడు ప్రచారం చేస్తే ప్రతీకార చర్యలకు తాము వెనుకాడబోమని కూడ ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ తరహ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఉత్తరకొరియా అమెరికాకు సూచించింది. లేకపోతే అమెరికాకే నష్టం వాటిల్లుతోందని హెచ్చరించింది.

చూస్తూ ఊరుకోం
అమెరికా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తేలేదని ఉత్తరకొరియా ప్రకటించింది.తాడో పేడో తేల్చుకొంటామని హెచ్చరించింది. ఉద్రిక్తతలను పెంచిపోషించేలా అమెరికా వ్యవహరిస్తోందని ఉత్తరకొరియా అభిప్రాయపడింది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications