కిమ్ జాంగ్ క్రూరత్వం: క్షిపణిలతో టాప్ మినిస్టర్స్ని చంపేశాడు
ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన మాటను జవదాటారన్న కారణంతో ఓ ప్రముఖ మంత్రిని, మరో టాప్ అధికారిని బహిరంగంగా ప్రజల మధ్య చంపించాడు. తద్వారా తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు.
అతను చంపించిన వ్యక్తి టాప్ మంత్రి. అత్యంత కిరాతకంగా ప్రజల మధ్య చంపించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల ప్రారంభంలో అధికారులను అందరూ చూస్తుండగా.. యుద్ధ విమానాలను పేల్చేసే క్షిపణులను వాడి ఆయన చంపించాడని తెలుస్తోంది.

ఆయన నేతృత్వంలో పని చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి హ్వాంగ్ మిన్, విద్యాశాఖలోని ఉన్నతాధికారి రీ యాంగ్ జిన్ తన ఆదేశాలు నిర్లక్ష్యం చేశారన్న కోపంతో చంపించినట్టు తెలుస్తోంది. మాట వినకపోతే సొంతవారని కూడా చూడకుండా చంపించడం కిమ్ జాంగ్కు అలవాటే. 2012లో ఆయన తన సొంత మామను, గత సంవత్సరంలో మాజీ రక్షణ మంత్రిని ఆయన బహిరంగంగా హత్య చేయించారు.












Click it and Unblock the Notifications