ఒమిక్రాన్ కరోనా వేరియంట్ల ముగింపు కాదు; అది ప్రాణాలు తీస్తుంది జాగ్రత్త: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు తీస్తోందని, ఇది తేలికపాటిది అని కొట్టిపారేయకూడదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాజాగా డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, ఇది చాలా దేశాలలో గతంలో ఆధిపత్యం చెలాయించిన డెల్టా వేరియంట్తో వేగంగా పోటీ పడుతోందని, ఆసుపత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ ను తేలికగా తీసుకోవద్దు.. ప్రాణాలు తీస్తుంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్
డెల్టాతో పోలిస్తే ఓమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ముఖ్యంగా టీకాలు వేసిన వారిలో,ఒమిక్రాన్ సోకటం తేలికపాటిదిగా తీసుకోకూడదని టెడ్రోస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. మునుపటి వేరియంట్ల మాదిరిగానే, ఓమిక్రాన్ ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తుందని , ఇది ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని, ఇది ప్రజలను చంపేస్తోంది అని ఆయన వివరించారు. వాస్తవానికి, కేసుల సునామీ చాలా పెద్దదని, చాలా వేగంగా కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు.ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలపై పెను భారాన్ని మోపుతోందని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్ లో దారుణ పరిస్థితులు ఉండొచ్చు
గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థకి కేవలం 9.5 మిలియన్ల కంటే తక్కువ కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది ఒక రికార్డు, ముందు వారం కంటే 71 శాతం పెరిగిందని టెడ్రోస్ తెలిపారు. అయితే ఇది కూడా తక్కువగా అంచనా వేయబడిందని క్రిస్మస్-న్యూ ఇయర్ సెలవుల సమయంలో, సానుకూల స్వీయ-పరీక్షలు నమోదు చేయబడలేదని, అధిక భారం ఉన్న నిఘా వ్యవస్థలు తప్పిపోయిన కేసులను ప్రతిబింబించలేదని టెడ్రోస్ చెప్పారు. ఇంకా భవిష్యత్ లో దారుణ పరిస్థితులు ఉండొచ్చని తెలిపారు.

వ్యాక్సినేషన్ లో అసమానతల వల్లే కొత్త వేరియంట్ ల పుట్టుక
టెడ్రోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చోటుచేసుకున్న అసమానతల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. గత సంవత్సరం ధనిక దేశాలు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మోతాదులను తమ దేశ పౌరులకు ఇచ్చాయని, వ్యాక్సినేషన్ కొనసాగని పేద రాష్ట్రాలలో ఇది వైరస్ వైవిధ్యాల ఆవిర్భావానికి కారణంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల కోవిడ్-19 సృష్టించే విధ్వంసాన్ని అంతం చేయడానికి, 2022లో వ్యాక్సిన్ మోతాదులను మరింత న్యాయంగా ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని ఆయన ప్రపంచాన్ని కోరారు.

వ్యాక్సినేషన్ పై దిశా నిర్దేశం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్
సెప్టెంబర్ 2021 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు తమ జనాభాలో 10 శాతం మరియు డిసెంబర్ చివరి నాటికి 40 శాతం టీకాలు వేయాలని టెడ్రోస్ కోరుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క 194 సభ్య దేశాలలో తొంభై-రెండు 2021 చివరి నాటికి నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయాయి అని, నిజానికి వాటిలో 36 మొదటి 10 శాతాన్ని కూడా వ్యాక్సినేషన్ చేయలేకపోయారని, ఎక్కువ వ్యాక్సిన్ డోస్లను తెప్పించ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. టెడ్రోస్ 2022 మధ్య నాటికి ప్రతి దేశంలో 70 శాతం వ్యాక్సినేషన్ చేయాలనుకుంటున్నారని వెల్లడించారు.

ఒమిక్రాన్ ముగింపు కాదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ, మహమ్మారి ముగిసేలోపు ఓమిక్రాన్ ఆందోళన యొక్క చివరి రూపాంతరం కాదని, ఇది ముగింపు కాదు అని అన్నారు. ఎక్కువ వ్యాప్తి చేసే గుణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడంలో, వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి వారు ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని వాన్ కెర్ఖోవ్ ప్రజలను కోరారు.ప్రజలలో ఇంకా కరోనా మహమ్మారి పై పూర్తిస్థాయి అవగాహన కనిపించటం లేదని, మాస్కులు లేకుండా చాలా దేశాలలో తారసపడుతున్న జనాలు ఉన్నారని, ఈ ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధమైన పంపిణీ లేకుంటే, 2022 చివరిలో కూడా కరోనా మహమ్మారి పైన ఇంకా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందని,భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉంటే అది దారుణమైన విషాదం అవుతుందని పేర్కొన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications