లండన్లో కాల్పుల కలకలం: స్టేషన్ మూసివేత
సెంట్రల్ లండన్లో శుక్రవారం కాల్పుల సంఘటన సంచలనం సృష్టించింది. ఆ ప్రాంతంలోని ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది.
లండన్: సెంట్రల్ లండన్లో శుక్రవారం కాల్పుల సంఘటన సంచలనం సృష్టించింది. ఆ ప్రాంతంలోని ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకుని స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించి, స్టేషన్ను మూసేశారు. అలాగే, ముందు జాగ్రత్తగా పక్కనున్న బాండ్ స్ట్రీట్ స్టేషన్నూ మూసివేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని సూచించారు. ఇప్పటికే అక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే రోడ్లపై తిరగకుండా, ఏవైనా భవనాల్లోకి వెళ్లిపోవాలనీ, స్థానికులు కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.

మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేశారు. ఈలోగా అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మరిన్ని భద్రతాబలగాలు కూడా మోహరించాయి. అయితే, తనిఖీల అనంతరం కాల్పులకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.38 గంటలకు తమకు కొందరు ఫోన్లు చేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చేమోనన్న అనుమానంతో చర్యలు చేపట్టామని వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications