ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్: ఉగ్రవాది హఫీజ్ సంసపై నిషేధం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కనుసన్నల్లో నడుస్తున్న తెహ్రీక్ ఇ ఆజాదీ జమ్మూ అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే సంస్థ పేరు మార్చుకొని
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కనుసన్నల్లో నడుస్తున్న తెహ్రీక్ ఇ ఆజాదీ జమ్మూ అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే సంస్థ పేరు మార్చుకొని జమాత్ ఉద్ దవా (జేయూడీ) గా కొనసాగుతోంది.
2008 లో ముంబై పేలుళ్ళ సూత్రదాది ఈ సంస్థే. ఈ సంస్థను పాక్ ప్రస్తుతం నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. హాపీజ్ సయీద్ ను పాక్ జనవరి చివర్లోనే గృహ నిర్భంధంలోకి తీసుకొంది. జేయూడీపై ఓ కన్నేసి ఉంచింది.

అయితే తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని తెలుసుకొన్న సయీద్ భారత్ లో దాడుల కోసం తెహ్రీక్ ఈ ఆజాద్ ఈ కశ్మీర్ కు సంకేతాలు పంపారు. ఇదిలా ఉంటే పదిరోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం పాక్ కు తీవ్ర హెచ్చరికలను పంపింది. ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తోందని పాక్ భూభాగంలోకి ఉగ్రస్థావరాలపై డ్రోన్లతో దాడులకు దిగుతామని హెచ్చరించింది.
దీనికి తోడు ఇటీవల ట్రంప్ మోడీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్త ప్రకటన జారీ చేసింది. భారత్ అమెరికాలు దగ్గరవుతున్నట్టు భావిస్తున్న పాక్ తాజా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సయీత్ సంస్థపై నిషేధం విధించినట్టు సమాచారం.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications