భారత్తో మేం యుద్ధం కోరుకోవడం లేదు: పాక్ విదేశాంగ మంత్రి
ఇస్లామాబాద్: తాము భారత్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం చెప్పాడు. అందుకే, చర్చల కోసం తాము ఆహ్వానించామని చెప్పాడు. ఈ రోజు (బుధవారం) స్ట్రైక్స్ తమ హక్కు అని చెప్పాడు. తమను తాము రక్షించుకోగలమని చెప్పాడు కానీ తాము యుద్ధం కావలని కోరుకోవడం లేదని చెప్పాడు. కాబట్టి భారత్ చర్చలకు రావాలని సూచించాడు.
భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్తో యుద్ధం కోరుకోవడం లేదంటూ పాకిస్తాన్ సైనికాధికారి ఆసిఫ్ గఫూర్ కూడా చెప్పాడు. సమస్యలపై ఇరు దేశాలు కలిసి చర్చిందుకుందామని పిలుపునిచ్చాడు. పాకిస్థాన్ బాధ్యతాయుత దేశమని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడం తమ ఉద్దేశం కాదన్నాడు. ఆత్మ రక్షణలో భాగంగానే పాక్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంట దాడులు చేశాయన్నాడు.

మరోవైపు, పాకిస్థాన్ సైనికులు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ను తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తమ భూభాగంలో కూల్చేసిన విమానం పక్కన అతని చేతులు వెనక్కి కట్టేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతను గాయపడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అభినందన్ను క్షేమంగా తీసుకురావాలంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఈ మేరకు bring abhinandan back హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications