ప్రధాని పదవికి నవాజ్షరీఫ్ రాజీనామా, రేసులో వీరే
పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు.పనామా కేసులో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇస్లామాబాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు.పనామా కేసులో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.రక్షణమంత్రి ఆసిఫ్ , నవాజ్ షరీఫ్ సోదరుడు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు.
పనామా కేసులో నవాజ్షరీప్తోపాటు ఆయన కుటుంబసభ్యులను కూడ కోర్టు తప్పుబట్టింది.అయితే ఈ విషయమై కోర్టు వెంటనే ఆయనను పదవి నుండి తప్పుకోవాలని కోరింది.
నవాజ్ షరీఫ్కు సుప్రీంకోర్టు భారీ షాక్: పాక్ ప్రధానిగా తొలగింపు
కోర్టు ఆదేశాల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్లో నిజాయితీ గల సభ్యుడిగా కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని కోర్టు అభిప్రాయపడింది.
అయితే కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకొనేందుకుగాను అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో షరీఫ్ సోదరుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహ్బజ్ షరీఫ్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ కూడ ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నారు.