హనీమూన్: భారత జంటను వీడియో తీసిన పాకిస్తానీ అరెస్ట్
దుబాయ్: హనీమూన్కు వెళ్లిన భారతీయ దంపతులు సన్నిహితంగా ఉన్న సమయంలో పాకిస్థాన్కు చెందిన వ్యక్తి రహస్యంగా వీడియోతీసి బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించడంతో అతడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన దుబాయిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల హనీమూన్ కోసం సదరు భారత జంట దుబాయ్కి వెళ్లింది. కారులో నగరమంతా చుట్టేశారు. కాగా, వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్ రహస్యంగా మొబైల్ ఫోన్తో వీడియో తీశాడు. వారు కారు దిగి వెళ్లిపోయిన తర్వాత పాకిస్థాన్కు చెందిన 28ఏళ్ల ఆ డ్రైవర్ వాట్సాప్ ద్వారా వీడియోను ఆ జంటకు పంపాడు.

అంతేగాక, 2000 దిర్హామ్లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే అతని భార్యనైనా ఇవ్వమన్నాడు. ఏమీ ఇవ్వకపోతే వీడియో సోషల్మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. కాగా, భారతీయ వ్యక్తి మరో స్నేహితుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పథకం ప్రకారం అతడికి 'డబ్బు ఇస్తాం' రమ్మని హోటల్కు పిలిచారు. దీంతో అక్కడే కాపు కాసిన పోలీసులు ఆ పాకిస్థాన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications