‘‘డ్రగ్స్ మాఫియాతో సంబంధాలుంటే.. నా కొడుకైనా సరే కాల్చిపారేయండి..’’
డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడ్డాడని నిరూపితమైతే తన కుమారుడినైనా కాల్చిపారేయాల్సిందేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె .
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ఆయన మాటలను బట్టి చెప్పవచ్చు. దేశంలో పేరుకుపోయిన డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న డ్యుటర్టె.. తన కుమారుడు పాలో డ్యుటర్టెపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడ్డాడని నిరూపితమైతే తన కుమారుడినైనా కాల్చిపారేయాల్సిందేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడంటూ అధ్యక్షుడి కుమారుడు పాలో డ్యుటర్టెపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

గతంలోనే డ్రగ్స్ రాకెట్లో పాలోపై ఆరోపణలు ఉండటంతో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా డీలర్లతో కలిసి పాలో డ్యుటర్టె దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు రొడ్రిగో ఈ విధంగా స్పందించారు.
'డ్రగ్స్ మాఫియాలో మా కుటుంబానికి సంబంధమే లేదు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటాను. నా కుమారుడు పాలో డ్రగ్స్ రాకెట్లో భాగస్వామి అని నిరూపించినట్లయితే అతడిని కాల్చిపారేయమని ఆదేశిస్తాను. పాలోను చంపిన వారికి రక్షణ కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను..' అంటూ అధ్యక్షుడు రొడ్రిగో వివరించారు.
గతేడాది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రగ్స్ రాకెట్పై సీరియస్గా ఉన్న రొడ్రిగో ఆదేశాలతో 3800 మందిని పోలీసులు కాల్చి చంపారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారితో పాటు వీటిని అక్రమరవాణా చేస్తున్న వారిపై రొడ్రిగో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
మీరు ఉగ్రవాదులను చంపితే ఎలాంటి భయం అక్కర్లేదు, సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి వాస్తవం చెప్పండంటూ మరోసారి దేశ ప్రజలకు భరోసా ఇవ్వడం గమనార్హం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications