గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు ప్రధాని మోడీ..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు. టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ భేటీ జరగనుంది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు మరో కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
2019లో చివరిసారిగా ప్రధాని చైనాను సందర్శించగా.. 2024 అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలుసుకున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు, ఇటు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి నేపథ్యంలో, చైనాతో సంబంధాలను సమతుల్యంగా పునరుద్ధరించుకోవడం భారత దౌత్యంలో వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే పాకిస్తాన్కు చైనా మద్దతు, జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వంటి అంశాల నేపథ్యంలో SCO వేదికపై భారత్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

SCO-2025..
గత జూన్లో SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఉగ్రదాడులపై సున్నితంగా స్పందించిన సంఘటన మరువలేనిది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడాన్ని నిరాకరించారు, ఎందుకంటే ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడి ప్రస్తావన అందులో లేకపోవడమే కాక, బలూచిస్తాన్ పరిస్థితులపై పరోక్షంగా భారత్ను నిందించినట్లు భావించబడింది. అయితే అమెరికా 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన వెంటనే, చైనా కూడా తమ వైఖరిని మార్చుకుంది. "అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం" అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఇది భారత ఒత్తిడికి చైనా స్పందించిన సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన అంశాలు..
SCO సమ్మిట్లో పాల్గొనే 10 సభ్యదేశాలు అయిన.. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ లు.. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఉగ్రవాదంపై రాజీలేని వైఖరిని సూచిస్తూ శాంతి-స్థిరత్వం కోసం దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో SCO వేదిక భారత్కు దౌత్య సంబంధాలను సమతుల్యం చేయడానికి కీలకంగా మారనుంది.
జి జిన్పింగ్, పుతిన్లతో ద్వైపాక్షిక చర్చలు..
మరోవైపు సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో అనధికారిక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అక్టోబర్ 2024లో జరిగిన బ్రిక్స్ సదస్సులో వీరిద్దరూ కలుసుకున్న అనంతరం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపులో కొంత మార్పు కనిపించిందని అధికారులు తెలిపారు. ఇటీవల కైలాష్-మానసరోవర్ యాత్ర పునఃప్రారంభం కావడం, వాణిజ్య మార్గాలపై చర్చలు తిరిగి చురుకుగా మారడం కూడా ఈ పర్యటనకు సానుకూల పర్యవసానం కలిగించే అంశాలుగా భావిస్తున్నారు.
భవిష్యత్తు లక్ష్యం..
- ఆర్థికపరంగా, భారత్ చైనా వాణిజ్య అసమతుల్యతను తక్కువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వాణిజ్య డైలాగ్లను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
- సైనిక స్థాయిలో, సరిహద్దు కమాండర్ స్థాయిలో జరిగే చర్చల పునరుద్ధరణపై దృష్టి పెట్టే అవకాశముంది.
- పర్యావరణ, టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో సహకారం చర్చకు వచ్చే అంశాలలో ఉండొచ్చు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications