వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌లో టైం బాంబు పేలుడు.. ముగ్గురు మృతి.. 25మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు మృతి చెందారు. దాదాపు 25 మందికి పైగా గాయపడ్డారు. లాహూర్‌లోని అనార్కలి బజారు ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుడు ధాటికి మార్కెట్ అంతా మంటలు వ్యాప్తించాయి.

బాంబు పేలుడు జరిగిన ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు చేరుకున్నాయి. ఈప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక మేయో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లాహోర్‌ పోలీసు అధికారి రాణా ఆరీఫ్‌ తెలిపారు. బాంబు పేలుడు దాటికి అనేక మోటర్ సైకిళ్లు, దుకాణాలు కాలిపోయాయి. భవనాల కిటికీలు ద్వంసం అయ్యాయి.

at least 5 killed, 25 injured in bomb blast at lahore anarkali market area

లాహోర్ లోని అంత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో అనార్కలి బజార్ ఒకటి . ఈ మార్కెట్‌లో ఎక్కువ‌గా భార‌తీయ‌ వస్తువులు అమ్ముతుంటారు. మార్కెట్‌ను అనుకుని ఉన్న పాన్ మండి సమీపంలో పార్కింగ్ చేసిన బైక్‌లో అమర్చిన టైం బాంబు ఈ పేలుడుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు లాహోర్ పోలీసు అధికారి రాణా ఆరీఫ్ తెలిపారు. స్థానికులు కూడా పార్క్ చేసిన మోటర్ సైకిల్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే అయితే ఈ బాంబు దాడికి తామే బాధ్యులమని బలోచ్ ఆర్మీ ప్రకటించింది.

Recommended Video

Kurebhar Airstrip : హైవేలపై ఎయిర్‌స్ట్రిప్‌లు.. టార్గెట్ China | Pakistan పాఠాలతో || Oneindia Telugu

English summary
at least 5 killed, 25 injured in bomb blast at lahore anarkali market area
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X