పప్వా న్యూగినియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక
పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఫలితంగా న్యూఐర్లాండ్ ద్వీపంలో స్వల్పసునామీ వచ్చింది.
సిడ్నీ: పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఫలితంగా న్యూఐర్లాండ్ ద్వీపంలో స్వల్పసునామీ వచ్చింది. కొకొపొ పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రిక్టారు స్కేలుపై 7.9గా నమోదైంది.

మొదట తీవ్రతను 8గా ప్రకటించినప్పటికీ తరువాత 7.9కు తగ్గించడం గమనార్హం. భూమికి 103 కిమీ లోపల, టరోన్కు తూర్పున 46 కిమీ వద్ద భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా భూభౌతిక సర్వే శనివారం తెలిపింది.
పపువా న్యూగినియా తీరప్రాంతంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం(పీటీడబ్ల్యూసీ) హెచ్చరించింది. ఆ తర్వాత అలాంటి ముప్పేమీలేదని స్పష్టం చేసింది. న్యూజిలాండ్ కూడా మొదటి సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఉపసంహరించుకుంది. కాగా, కొన్ని ద్వీపసమూహాలకు స్వల్పంగా సునామీ తాకే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications