కుట్రపూరితంగా తప్పుడు కేసు .. జాదవ్ ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టులో భారత్
హేగ్ : భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత విదేశాంగ శాఖ వాదనలు వినిపిస్తోంది. మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ పై పాకిస్థాన్ కుట్రపూరితంగా తప్పుడు కేసు బనాయించిందని కోర్టుకు తెలిపింది. జాదవ్ కు వ్యతిరేకంగా ప్రాథమిక అంశాలను కూడా పాకిస్థాన్ బయటపెట్టలేదని ఈ సందర్భంగా ధర్మాసనానికి వెల్లడించింది.
కుల్ భూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డారని పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. నేవీ అధికారిగా పదవీ విమరణ చేశాక .. వ్యాపారం చేస్తున్న జాదవ్ పై కావాలనే గూఢచర్యం ఆరోపణలు మోపిందని ఎండగట్టింది. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు శిక్షను తప్పుపడుతూ హేగ్ లోని ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. సోమవారం కుల్ భూషణ్ జాదవ్ తరఫను భారత విదేశాంగ శాఖ తన వాదనలు వినిపించింది.