హృదయవిదారకం: 31మంది మునిగిపోతుంటే చూస్తూ ఉండిన రెస్క్యూ టీం
యూరోప్: ఏజియన్ సముద్రంలో ఘోరం జరిగింది. శరణార్థులతో వస్తున్న ఓ చిన్న పడవ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ పడవ మునిగిపోతుంటే... సమీపంలోనే ఉన్న రెస్క్యూ బృందం చూస్తూ ఉండిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 31మంది శరణార్థులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఏమీ చేయలేని తమ నిస్సహాయ స్థితికి, బాధపడటం తప్ప వారికి సహకరించలేకపోయామని రెస్క్యూ బృందం చెబుతోంది. ఆస్ట్రేలియా జాతీయుడు సిమాన్ లూయిస్, అతని బృందం గ్రీక్ దీవుల్లో భాగమైన లెస్బోస్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.

సముద్ర జలాల్లో తిరుగుతున్న తమకు ఓ పడవ ప్రమాదంలో ఉన్నట్టు కనిపించిందని, దాని సమీపానికి వెళ్లి చూశామని, దాదాపు 31 మందితో ఉన్న పడవ తీరానికి చేరే పరిస్థితి లేదని తెలుసుకున్నామని, మహిళలు, చిన్నారులు ఉన్న ఆ పడవకు ఐదు మీటర్ల దూరంలో తాము ఆగిపోయామని సిమాన్ వెల్లడించారు.
వారు ఉన్న పడవ టర్కీ పరిధిలోని జలాల్లో ఉండటం, తాము రక్షిస్తే, తమపై ప్రజలను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తాయన్న భయంతోనే దూరంగా ఉండిపోయామన్నారు. 'జీవితమంటే, ఇదే. మునిగిపోతున్న వారిని చూస్తూ కూడా కాపాడలేకపోయాం. అంతర్జాతీయ జల నిబంధనలు అలా ఉన్నాయి. ఓ మహిళ తన బిడ్డను తీరం వైపు విసరడం కనిపించింది. గుండెలు పగిలే పరిస్థితిలో ఆమెను చూస్తూ ఉండిపోయామ'ని అన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications