పాకిస్తాన్ లో అత్యంత ధనవంతుడు నరేంద్ర మోఢీ కి అభిమాని
పాకిస్తాన్ లో అత్యంత ధనవంతుడు మాలిక్ భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభిమాని.ఇండియాలో మోడీ ప్రవేశపెట్టిన పెద్ద నగదు నోట్ల రద్దు ను ఆయన స్వాగతించారు. ఇదే తరహలో పాకిస్తాన్ లో కూడ పెద్ద నగదు నోట్లను రద
ఇస్లామాబాద్ :పాకిస్తాన్ దేశంలో అత్యంత సంపన్నుడు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని అభిమానిస్తాడు. ఇండియాలో మోడీ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసల్లో ముంచెత్తుతాడు. పెద్ద నగదు నోట్ల రద్దు ను పాకిస్తాన్ లో కూడ చేట్టాలని ఆయన ఆ దేశ ప్రధానిని కోరుతున్నాడు.
పాకిస్తాన్ దేశంలో అత్యంత సంపన్నుడు మాలిక్ ఇండియా ప్రధాని నరేంద్రమోడీకి అభిమాని, నల్లధనాన్ని అరికట్టేందుకు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పెద్ద నగదు నోట్ల రద్దును ఆయన స్వాగతించారు. అయితే పాకిస్తాన్ మాత్రం పెద్ద నగదు నోట్ల రద్దును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

జియో టివి నిర్వహించిన ఇంటర్వ్యూ లోఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. పాకిస్తాన్ లో కూడ నల్లధనం అరికట్టాలంటే భారత్ అవలంభించిన విధానాలను అనుసరించాల్సిందేనని చెప్పారు.
భారత్ తరహలోనే పాకిస్తాన్ లో కూడ పెద్ద నగదు నోట్లను రద్దు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని ఐదువందలు, వెయ్యి, ఐదువేల రూపాయాల నగదును రద్దుచేయాలని, దేశంతో పాటు విదేశాల్లో స్థిరపడిన పాకిస్తానీయులకు కూడ వర్తింపజేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications