యూరప్తో యుద్ధానికి రష్యా సిద్ధం!: పుతిన్ వార్నింగ్
యూరోపియన్ శక్తులతో తాము యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని.. అయితే ఒకవేళ యూరప్ దేశాలు మాస్కోతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైతే, తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం స్పష్టం చేశారు. "మేము యూరప్తో యుద్ధానికి వెళ్లడం లేదు, ఇదివరకే చెప్పాను. కానీ యూరప్ అకస్మాత్తుగా మాతో యుద్ధం చేయాలనుకుంటే, దాన్ని మొదలుపెడితే, మేము వెంటనే సిద్ధంగా ఉంటాము. దీనిపై ఎటువంటి సందేహం లేదు" అని పుతిన్ అన్నారు. ఒకవేళ యూరప్ రష్యాతో యుద్ధం మొదలుపెడితే, అప్పుడు "మాట్లాడటానికి ఎవరూ ఉండని పరిస్థితి" ఏర్పడవచ్చు అని కూడా ఆయన హెచ్చరించారు.
శాంతి చర్చల నుంచి యూరప్ దూరం
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు యూరోపియన్ దేశాలు ఆటంకం కలిగిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాకు ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాని ప్రతిపాదనలను ముందుకు తెచ్చి, ఆ తర్వాత రష్యా శాంతిని కోరుకోవడం లేదని నిందించడం ద్వారా శాంతి చర్చలకు అడ్డుపడుతున్నారని పుతిన్ పేర్కొన్నారు. యూరోపియన్ శక్తులు రష్యాతో సంబంధాలను తెంచుకోవడం ద్వారా ఉక్రెయిన్ శాంతి చర్చల నుంచి తమను తాము దూరం చేసుకున్నాయని పుతిన్ అన్నారు. "వారు యుద్ధం వైపు మొగ్గు చూపుతున్నారు" అని ఆయన యూరోపియన్ దేశాలపై మండిపడ్డారు.

ఉక్రెయిన్కు సముద్ర మార్గం బంద్!
నల్ల సముద్రంలో రష్యాకు చెందిన "షాడో ఫ్లీట్" చమురు ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్కు సముద్ర మార్గాన్ని పూర్తిగా నిలిపివేస్తానని పుతిన్ బెదిరించారు. "అత్యంత కఠినమైన పరిష్కారం ఏమిటంటే, ఉక్రెయిన్ను సముద్రం నుంచి పూర్తిగా వేరుచేయడం, అప్పుడు పైరసీ సిద్ధాంతంలో అసాధ్యం అవుతుంది" అని ఆయన అన్నారు. ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న దేశాల ట్యాంకర్లపై కూడా చర్యలు తీసుకుంటామని పుతిన్ హెచ్చరించారు.
చమురు ట్యాంకర్లపై డ్రోన్ దాడులు
గత శనివారం నల్ల సముద్రంలో విదేశీ మార్కెట్ల కోసం చమురు లోడ్ చేయడానికి రష్యన్ పోర్టుకు వెళ్తున్న రెండు ఆంక్షలు విధించబడిన ట్యాంకర్లపై ఉక్రెయిన్ నావికా డ్రోన్లు దాడి చేశాయని ఓ ఉక్రెయిన్ భద్రతా అధికారి తెలిపారు. మంగళవారం కూడా టర్కీ తీరంలో రష్యా జెండా ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగిందని టర్కీ సముద్ర అధికారులు తెలిపారు. అయితే ఆ దాడితో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ రష్యన్ నల్ల సముద్ర పోర్ట్ నోవోరోస్సిస్క్పై క్షిపణులు, డ్రోన్ దాడులు చేయడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది.
పుతిన్ ఈ వ్యాఖ్యలు అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో రష్యా అధ్యక్షుడిని కలిసి, ఉక్రెయిన్లో దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి వాషింగ్టన్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చించడానికి వచ్చిన సమయంలో రావడం గమనార్హం.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications