Russia Ukraine War: కార్ల మీద చైనా జెండా ఉంటే సేఫ్, ఉక్రెయిన్ లో చైనీయులకు సలహా!
ముంబాయి: ఉక్రెయిన్ మీద రష్యా బాంబుల దాడి చేస్తున్న సమయంలో అక్కడి చైనా విదేశాంగ అధికారులు రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ లో ఉంటున్న చైనీయులు జాగ్రత్తగా ఉండాలని, మేము సూచించే వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చైనా విదేశాంగ శాఖ అధికారులు హెచ్చరించారు. చైనీయులు బయట తిరిగే సమయంలో వాళ్ల కార్లు, వాహనాల మీద చైనా జెండాలు తప్పకుండా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ లో సంచరించే సమయంలో చైనీయులు వారి వాహనాల మీద చైనా జెండాలు కట్టుకుంటే సేఫ్ గా ఉండటానికి అవకాశం ఉంటుందని చైనా బావిస్తోంది.
Recommended Video
ఇదే సమయంలో భవనాల్లో ఉన్న సమయంలో కిటికీలు, గాజులు ఉన్న ప్రాంతాలకు చైనీయులు దూరంగా ఉండాలని, కట్టడాలకు వీలైనంత దూరంగా ఉండాలని, కట్టడాలు, భవనాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించింది. యుద్దం జరుగుతున్న సమయంలో తీసుకోవాలని జాగ్రత్తల మీద చైనా విదేశాంగ శాఖ అధికారులు ఆదేశంలోని చైనీయులను అప్రమత్తం చేసింది.

ఉక్రెయిన్ లో పరిస్థితులు తారుమారైయి
గురువారం ఉదయం ఒక్కసారిగా రష్యా సైనిక బలగాలు రంగంలోకి దిగి ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా యుద్దవాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆ దేశంలో ఉన్న ఇతర దేశాల ప్రజలు హడలిపోయారు. ఉక్రెయిన్ లో యుద్దం జరుగుతున్న సమయంలో ఆదేశంలో ఉన్న ప్రజలు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

చైనా అధికారులు ఎంట్రీ
ఉక్రెయిన్ మీద రష్యా బాంబుల దాడి చేస్తున్న సమయంలో అక్కడి చైనా విదేశాంగ అధికారులు రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ లో ఉంటున్న చైనీయులు జాగ్రత్తగా ఉండాలని, మేము సూచించే వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చైనా విదేశాంగ శాఖ అధికారులు ఉక్రెయిన్ లో ఉన్న చైనీయులను హెచ్చరించారు.

వాహనాల మీద చైనా జెండాలు ఉంటే సేఫ్
చైనీయులు బయట తిరిగే సమయంలో వాళ్ల కార్లు, వాహనాల మీద చైనా జెండాలు తప్పకుండా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ లో సంచరించే సమయంలో చైనీయులు వారి వాహనాల మీద చైనా జెండాలు కట్టుకుంటే సేఫ్ గా ఉండటానికి అవకాశం ఉంటుందని చైనా బావిస్తోంది.

చైనీయులు అందరూ ఏకం కావాలి
ఉక్రెయిన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో చైనీయులు జాగ్రత్తగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ లో ఉన్న చైనీయులు అందరూ చైనా అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని, తాజా సమాచారం తెలుసుకోవాలని, చైనీయులు అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని చైనా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు.

కిటికీలు, గాజు అద్దాలకు దూరంగా ఉండండి
ఇదే సమయంలో భవనాల్లో ఉన్న సమయంలో కిటికీలు, గాజులు ఉన్న ప్రాంతాలకు చైనీయులు దూరంగా ఉండాలని, కట్టడాలకు వీలైనంత దూరంగా ఉండాలని, కట్టడాలు, భవనాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించింది. యుద్దం జరుగుతున్న సమయంలో తీసుకోవాలని జాగ్రత్తల మీద చైనా విదేశాంగ శాఖ అధికారులు ఆదేశంలోని చైనీయులను అప్రమత్తం చేసింది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications