Russia-Ukraine War:ఉక్రేయిన్ పౌరులకు యూఏఈ షాక్- తాత్కాలికంగా వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ పౌరులు చుట్టు పక్కల దేశాలకు వలసపోతున్నారు. అదే క్రమంలో మరికొందరు గల్ఫ్ దేశాలకు కూడా వెళ్తున్నారు. యూఏఈ సహా పలు గల్ఫ్ దేశాల్లో ఉక్రెయిన్ పౌరులకు ఇప్పటికే వీసా మినహాయింపు కూడా ఉంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారికి యూఏఈ షాక్ ఇచ్చింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉక్రెయిన్ పౌరులకు వీసా మినహాయింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు గల్ఫ్ అరబ్ రాష్ట్రంలోని కైవ్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుత యుద్ధ సమయంలో వేలాది మంది ప్రజలు ఉక్రెయిన్ నుంచి పారిపోయి విదేశాలకు చేరుకుంటున్న నేపథ్యంలో UAE నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. కారణం చెప్పకుండానే ఎంబసీ తన ఫేస్బుక్ పేజీలో ఉక్రెయిన్ పౌరులకు ఈ మేరకు నోటీసు ఇచ్చింది. దీనికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదు.

క్లిష్ట సమయంలో తమకు వీసా మినహాయింపు నిరాకరించడాన్ని ఉక్రేనియన్లు తప్పుబడుతున్నారు. ప్రపంచం మొత్తం ఉక్రేనియన్లకు సాయం చేస్తున్న వేళ.. యూఏఈ తీసుకున్న నిర్ణయాన్ని వారు ఖండిస్తున్నారు. ఉక్రేనియన్లు తమ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించకపోతే , వీసా అవసరం ఉంటే అది నిజానికి యూఏఈ నేరంగా వారు భావిస్తున్నారు. ఈ సమయంలో తాము వీసా ఎలా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
రష్యా దాడి కారణంగా దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు పారిపోయారు. లక్షలాది మంది శరణార్థుల కోసం సిద్ధమవుతున్నట్లు యూరోపియన్ యూనియన్ తెలిపింది.
ఈ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబించి, కాల్పుల విరమణ, దౌత్యానికి పిలుపునిచ్చిన యుఎఇ, ఉక్రెయిన్లోని పౌరులకు 5 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. అయితే రష్యాకు భయపడే యూఏఈ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications