షాకింగ్: ఈ దంపతులిద్దరూ.. 30 మందిని చంపి తినేశారు!
రష్యాలో ఓ దంపతులు నరమాంస భక్షకులుగా మారిపోయారు. వీరు ఇప్పటి వరకు 30 మందిని చంపి తినేశారు. వారి ఘాతుకం వెలుగుచూసిన వెంటనే పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.
మాస్కో: రష్యాలో ఓ దంపతులు నరమాంస భక్షకులుగా మారిపోయారు. వీరు ఇప్పటి వరకు 30 మందిని చంపి తినేశారు. వారి ఘాతుకం వెలుగుచూసిన వెంటనే పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.
రష్యాలోని క్రాస్నోడర్లో నివసిస్తున్న దిమిత్రీ బక్షీవ్(35), నటాలీ(42) భార్యాభర్తలు. చూడటానికి మామూలుగా కనిపించే ఈ దంపతులిద్దరూ 1999 నుంచీ నరమాంసం రుచిమరిగారు. అవసరమైనప్పుడల్లా దొరికిన మనిషిని దొరికట్లే చంపేసి తినేసేవారు.

దిమిత్రీ భవన నిర్మాణ కార్మికుడిగా రోజంతా రెక్కలుముక్కలు చేసుకునేవాడు. భార్య నటాలీ మాత్రం ఇంట్లోనే కూచుని సీసాల కొద్దీ మద్యాన్ని ఖాళీ చేస్తుండేది. దిమిత్రీ ఓ రోజు తన మొబైల్ ఫోన్ను రోడ్డు పక్కనే మరిచిపోవడంతో ఈ సంచలన విషయం వెలుగుచూసింది.
దిమిత్రీ మొబైల్ ఫోన్ అతడితోపాటు పనిచేసే మరో భవన నిర్మాణ కార్మికుడికి దొరికింది.
ఎవరిదబ్బా ఈ ఫోను.. అని చూస్తుంటే అందులో ఖండఖండాలుగా నరికి ఉన్న మానవ శరీర భాగాల ఫొటోలు కనిపించాయి. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి మరింతగా వెతికేసరికి దిమిత్రి ఫోటో ఒకటి కనిపించింది.
ఆ ఫొటోలో ఓ మనిషి మృతదేహం శరీరభాగాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతూ దిమిత్రి కనిపించాడు. దీంతో భయపడిన ఆ కార్మికుడు.. నేరుగా ఫోన్ను పట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లాడు. చూడగానే పోలీసులకు అర్థమైపోయింది. వారు వెంటనే దిమిత్రీ నివాసంపై దాడిచేశారు.
దిమిత్రి ఇంట్లో పోలీసులకు కొన్ని మృతశరీర భాగాలు కనిపించాయి. నిల్వ చేసి ఉన్న మాంసం ముద్దలు కూడా కనిపించాయి. దీంతో పోలీసులు ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో... వారు నరమాంసం రుచిమరిగిన వైనం వెలుగు చూసింది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నివసిస్తున్న దిమిత్రీ దంపతులు తమకు తెలుసని పొరుగునే ఉన్న ఓ దుకాణదారు తెలిపారు.
తమ దుకాణానికి తరచూ వచ్చే దిమిత్రీ దగ్గర నుంచీ ఓ రకమైన వింతవాసన వచ్చేదని చెప్పారు. దిమిత్రీ ఇంట్లో కుందేళ్లు, కుక్కలను పెంచుకుంటున్న నేపథ్యంలో తాను ఆ వాసనను పెద్దగా పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications