Russian Ukraine War: రష్యా దెబ్బ, ఉక్రెయిన్ లో 10 లక్షల మంది, ఆ రోజు సిరియా, ఇప్పుడు !
ఉక్రెయిన్/ మాస్కో/ అమెరికా: ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టి 7 రోజులు అవుతోంది. రష్యా దెబ్బతో ఉక్రెయిన్ లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికే 10 లక్షల మంది ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
ఉక్రెయిన్ లో ఉన్న వివిద దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్ దేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోతున్నారని ఐక్యరాజ్య సమతి తెలిపింది. ఉక్రెయిన్ ను వదిలి వెళ్లిపోతున్న వారిలో లక్ష మందికి పైగా రష్యాకు పారిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అంటున్నారు. ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. రష్యా వైమానిక దాడులు, నేల మీద సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న భారతీయులు, విదేశీయులు హడలిపోతున్నారు. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో రష్యా సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు. 2020 చివరి నాటికి జనాభా లెక్కల ప్రకారం ఉక్రెయిన్ లో 22 మిలియన్ల ప్రజలు ఉంటున్నారు.
రష్యా దెబ్బతో 4 మిలియన్ల ప్రజలు (40 లక్షల మంది) క్రెయిన్ ను విదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అంచనా వేశారు. కొన్ని రోజులు ఇంకా కొన్ని లక్షల మంది ఉక్రెయిన్ వదిలిపారిపోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి సీనియర్ ప్రతినిధి అంచనా వేశారు. రష్యా దాడులతో సతమతం అవుతూ ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కు మంటు బతుకుతున్నారని, లక్షల మంది ఇప్పుడు ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారని యూఎన్ హెచ్ సీఆర్ తెలిపింది. 2011లో అంతర్యుద్దంతో చెలరేగిన హింసకారణంగా సిరియా నుంచి 5.6 మిలియన్ల ప్రజలు ఆదేశాన్ని వదిలిపారిపోయారు,
Russian Ukraine War: లంచం వసూలు చేసిన ఉక్రెయిన్ పోలీసులు, తప్పించుకున్న సోదరులు !
రష్యా దెబ్బతో హడల్
ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు వారి స్వదేశాలతకు, సామాన్య ప్రజలు పొరుగు దేశాలకు పారిపోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు.
రష్యా అణ్వస్త్ర బెదిరింపులు
ఉక్రెయిన్ మీద రగిలిపోతున్న రష్యా ఆ దేశం మీద అ అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని పదేపదే బెదిరిస్తోంది. రష్యా అణ్వస్త్ర దాడులకు దిగితే భారీ మొత్తంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని, ఇది వినాశనానికి దారితీస్తుందని ప్రపంచదేశాలతో పాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణభయంతో 10 లక్షల మంది
రష్యా యుద్దం మొదలు పెట్టి 7 రోజులు అవుతోంది. రష్యా దెబ్బతో ఉక్రెయిన్ లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికే 10 లక్షల మంది ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న వివిద దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్ దేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోతున్నారని ఐక్యరాజ్య సమతి తెలిపింది.
రష్యా సైనికుల అరాచకాలు
ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. రష్యా వైమానిక దాడులు, నేల మీద సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న భారతీయులు, విదేశీయులు హడలిపోతున్నారు. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో రష్యా సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు.
ఉక్రెయిన్ లో 44 మిలియన్ల జనాభ
2020 చివరి నాటికి జనాభా లెక్కల ప్రకారం ఉక్రెయిన్ లో 22 మిలియన్ల ప్రజలు ఉంటున్నారు, రష్యా దెబ్బతో 4 మిలియన్ల ప్రజలు (40 లక్షల మంది) క్రెయిన్ ను విదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అంచనా వేశారు. కొన్ని రోజులు ఇంకా కొన్ని లక్షల మంది ఉక్రెయిన్ వదిలిపారిపోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి సీనియర్ ప్రతినిధి అంచనా వేశారు.
40 లక్షల మంది వెళ్లిపోయే చాన్స్ ఉంది
రష్యా దాడులతో సతమతం అవుతూ ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కు మంటు బతుకుతున్నారని, కొన్ని లక్షల మంది ఇప్పుడు ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారని యూఎన్ హెచ్ సీఆర్ తెలిపింది. సుమారు 40 లక్షల మంది ఉక్రెయిన్ ను వదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి జోంగ్ అహ్ ఘెడిని విలియమ్స్ అంటున్నారు.
అప్పుడు సిరియాలో సేమ్ సీన్ !
2011లో అంతర్యుద్దంతో చెలరేగిన హింసకారణంగా సిరియా నుంచి 5.6 మిలియన్ల ప్రజలు ఆదేశాన్ని వదిలిపారిపోయారు, ఆ రోజు సిరియాలోని ప్రజలు ప్రాణభయంతో దేశం విడిచిపారిపోయారని, సిరియా తరువాత ఇప్పుడ ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు ఆదేశం విడిచిపారిపోవడానికి కొన్ని లక్షల మంది సిద్దం అవుతున్నారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధిలు అంటున్నారు.