శారదా స్కాం: సీబీఐ సోదాలు, రెండో ఛార్జ్ షీట్ దాఖలు

కోట్లాది రూపాయల ఈ స్కాంలో సీబీఐ అధికారులు రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్లో తృణమూల్ వైస్ ప్రెసిడెంట్, మాజీ డైరెక్టర్ జనరల్ (రాష్ట్ర సాయుధ పోలీసు) రజత్ మజుందార్, తూర్పు బెంగాల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ దేవవ్రత సర్కార్లు ఈ కుంభకోణం ద్వారా సేకరించిన డబ్బుతో ప్రయోజనం పొందారని పేర్కొంది.
వీరితో పాటు శారదా చిట్ ఫండ్ ఛైర్మన్ సుదీఫ్త గుప్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబ్జానీ ముఖర్జీ, బిజినెస్ మ్యాన్ సంధీర్ అగర్వాల్.. తండ్రి సజ్జన్ అగర్వాల్, అస్సాం సింగర్ సదానంద గగోయ్లు పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే తొలి ఛార్జ్ షీటును అక్టోబరు 22న కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఇదే స్కాంలో ఈ రోజు ఒడిశాలోని 22 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ స్కాంలో ప్రముఖ 'సీషోర్ గ్రూప్'కు సంబంధం ఉందంటూ ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నారు. బీజేపీ నేత ప్యారీమోహన్ మహాపాత్ర నివాసంలోనూ సోదాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications