గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ అరేబియా.. ఏప్రిల్ 1 నుంచి..
రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుుంది. చమురు ఉత్పత్తి ద్వారా ఇన్నాళ్లూ ఆదాయం ఆర్జించిన సౌదీ ఇప్పుడు రూటు మార్చింది. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని భావిస్తున్న ఆ దేశం తాజాగా పర్యాటకరంగం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.
ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'విజన్ 2030' ప్రణాళికను అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పచ్చజెండా ఊపారు.
2030 నాటికి ఏడాదికి 30 మిలియన్ల మంది సౌదీలో పర్యటించేలా చేయడమే ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము కూడా టూరిస్టు వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.

అంతేకాదు.. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చే వారికి కూడా అవసరమైన వీసాలు జారీ చేయనున్నట్లు సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునే వారికి ఇది శుభవార్తేనని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు.
వచ్చే జూన్లో సౌదీ ఆరేబియా రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత యువరాజు సల్మాన్ పలు కీలకమైన సంస్కరణలకు నడుం బిగించారు. మహిళలకు కారు డ్రైవింగ్ అనుమతితోపాటు, సౌదీ చరిత్రలో మొదటిసారిగా మగవారి తోడు లేకుండా మహిళలకు ప్రయాణానికి అనుమతి, సినిమా థియేటర్లు తెరవడం వంటి కొన్ని కీలక సంస్కరణ చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications