మళ్లీ ఉలిక్కిపడ్డ లండన్: సెవెన్ సిస్టర్స్ రోడ్డులో భీభత్సం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన వ్యాన్
రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయక బృందాలు భ్రదతను కట్టుదిట్టం చేశాయి. సెవెన్ సిస్టర్స్ రోడ్డును తాత్కాళికంగా మూసివేశాయి. ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
లండన్: లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సాన్ని మరిచిపోకముందే.. నగరంలోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులో మరో దారుణం చోటు చేసుకుంది. పాదచారుల పైకి వ్యాన్ వేగంగా దూసుకెళ్లడంతో.. 22మంది వరకు గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు
లండన్ లోని ఫిన్స్ బరీ పార్క్ లోని సెవెన్ సిస్టర్ రోడ్డులో.. రాత్రిపూట ముస్లింలు నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.22నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటనతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయక బృందాలు భ్రదతను కట్టుదిట్టం చేశాయి. సెవెన్ సిస్టర్స్ రోడ్డును తాత్కాళికంగా మూసివేశాయి. ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్న పోలీసులు.. ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.