అవినీతి కేసులో షేక్ హసీనాకు 21 ఏళ్ల జైలుశిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఢాకా న్యాయస్థానం గురువారం ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. రాజధాని డెవలప్మెంట్ అథారిటీకి చెందిన పూర్బచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక శాఖ ఈ మూడు కేసులను నమోదు చేయగా.. షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఏడేళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎలాంటి దరఖాస్తు లేకుండానే షేక్ హసీనాకు స్థలం కేటాయించబడిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈ కేసుల్లో షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక లక్ష టాకాల(బంగ్లాదేశ్ కరెన్సీ) జరిమానా విధించబడింది. అలాగే ఆమె కుమార్తె సైమా వాజేద్ కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడింది. అవినీతి కమిషన్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై మొత్తం ఆరు వేర్వేరు కేసులను దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల్లో తీర్పు డిసెంబర్ 1న ప్రకటించబడుతుంది.

అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష
అవినీతి కేసుల తీర్పు కంటే ముందే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాకు మరో కేసులో మరణశిక్ష విధించింది. 2024 జులైలో ప్రభుత్వంపై జరిగిన విద్యార్థి నేతృత్వంలోని నిరసనలు, ఆందోళనలను అణచివేయడానికి హసీనా ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు జరిగిన హింసకు ఆమె దోషిగా తేలారు. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయి ఉండటంతో నిందితులు హాజరు కాకుండానే కోర్టు తీర్పును ప్రకటించింది. విచారణ సమయంలో వారికి న్యాయపరమైన ప్రాతినిధ్యం కూడా లేదు.
భారత్కు అప్పగింత అభ్యర్థన
షేక్ హసీనా గత సంవత్సరం (2024 జులైలో) విద్యార్థి తిరుగుబాటు కారణంగా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి, ఆగస్టు 5న దేశం విడిచి పారిపోయి భారత్లో ఆశ్రయం తీసుకున్నారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. హసీనాకు ఐసీటీ మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మాట్లాడుతూ.. ఢాకా నుంచి అభ్యర్థన అందినట్లు ధ్రువీకరించారు. ఆ అభ్యర్థనను భారత సర్కారు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications