స్పృహతప్పి కిందపడ్డ సింగపూర్ ప్రధాని, భయపెట్టానని..
సింగపూర్: సింగపూర్ ప్రధానమంత్రి లీ లూంగ్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ స్పృహతప్పి కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న మంత్రులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధానిని పట్టుకొని స్టేజీ కిందకు తీసుకు వెళ్లారు వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
ప్రధాని ఆదివారం నాడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడున్న వారంతా కంగారుపడ్డారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ప్రసంగం చూస్తున్నవారందరికీ ఏం జరిగిందో అర్థంకాక ఆందోళన చెందారు.

51వ జాతీయ దినోత్సవం జరిగింది. సంప్రదాయం ప్రకారం దేశ ఆర్థిక, రాజకీయ, పాలసీల గురించి ప్రసంగిస్తుండగా ఆయన కిందపడ్డారు. బాగా అలిసిపోవడం వల్ల అస్వస్థతకు గురైన లీ వెంటనే కోలుకున్నారు. ఆ తర్వాత గంటకు తిరిగి వేదికపైకి వచ్చిన లీ ప్రసంగం పూర్తి చేశారు.
ఆయన మళ్లీ వేదికపైకి రాగానే అక్కడున్న వారంతా మర్యాదపూర్వకంగా లేచి నిలుచున్నారు. వేచి ఉన్నందుకు లీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అందరినీ భయపెట్టేశాను అంటూ నవ్వేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటానన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications