పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
ప్రపంచవ్యాప్తంగా తెగుళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసే శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. కేవలం రెండు జాతులు మాత్రమే మిగతా అన్ని జీవుల కన్నా అధికంగా హాని కలిగిస్తున్నాయని కనుగొన్నారు.
'అమెరికన్ బుల్ ఫ్రాగ్' అనే కప్ప, 'బ్రౌన్ ట్రీ స్నేక్' అనే పాములు 1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,39,087 కోట్ల (16.3 బిలియన్ డాలర్లు) నష్టాన్ని కలిగించాయి.
ఈ రెండు జాతులు, పర్యావరణానికి హాని కలిగించడంతో పాటుగా వ్యవసాయ పంటలను నాశనం చేశాయి. విద్యుత్ అంతరాయాలను కలిగించాయి.
కేవలం 'బ్రౌన్ ట్రీ స్నేక్' వల్లే రూ. 81,570 కోట్ల నష్టం వాటిల్లిందని సైంటిఫిక్ రిపోర్టులో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ దీవుల్లో ఈ పాములు విచ్చలవిడిగా ఉన్నాయి.
అమెరికాలోని గ్వామ్ ప్రాంతంలో అమెరికా నావికా దళాలు గత శతాబ్ధంలో అనుకోకుండా ఈ పాము జాతిని గుర్తించాయి. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా పెరిగింది. ఇవి భారీ ఎత్తున విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి. ఈ పాములు విద్యుత్ తీగలపై జారి పడిపోతూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
చిన్నదైన పసిఫిక్ ద్వీపంలోనే ఈ పాముల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది. ఈ జాతుల వల్ల దీవుల్లోని పర్యావరణ వ్యవస్థకు మరింత హాని కలుగుతుందని భావిస్తున్నారు. స్థానిక జంతువులు, జీవ జాలానికి ఇవి ముప్పును కలిగిస్తాయి.
- ఈ దేశంలో కుక్కలు, పిల్లుల్ని పెంచితే జైలుకే.. పార్లమెంటుకు 'జంతువుల నుంచి మానవ హక్కుల పరిరక్షణ' బిల్లు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
యూరప్లో వేగంగా పెరుగుతోన్న అమెరికన్ బుల్ ఫ్రాగ్ల కోసం ఖరీదైన, పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కప్పలు 30 సెం.మీ వరకు పెరుగుతాయి. అరకిలో బరువు వరకు ఉంటాయి.
వీటి వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు ఖరీదైన ఫ్రాగ్ ప్రూఫ్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
కప్పలు తప్పించుకోకుండా నిరోధించడానికి 5 చెరువులకు వేసిన కంచె కోసం జర్మన్ అధికారులు రూ. 2.18 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక పాత ఈయూ అధ్యయనం పేర్కొంది.
ఇవి ప్రతీదాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. ఇతర బుల్ ఫ్రాగ్స్ను కూడా ఇవి తింటాయి.
కోకి ఫ్రాగ్ అనే మరో కప్ప జాతి కూడా విభిన్న తరహాలో ఆర్థిక నష్టం కలిగిస్తుందని తెలిసింది. అవి చేసే శబ్ధాల కారణంగా సమీప ప్రాంతాల్లోని భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్తుల విలువ పడిపోయినట్లు నమ్ముతారు.
భవిష్యత్లో తెగుళ్ల నియంత్రణతో పాటు ఇతర బయో సెక్యూరిటీ చర్యల్లో మరింత పెట్టుబడులు పెట్టేలా తమ పరిశోధనలు అధికారులను ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చికోటి ప్రవీణ్ ఎవరు? తెలుగు రాష్ట్రాలను కుదుపుతోన్న క్యాసినో కేసు ఏంటి? ప్రముఖులతో ప్రవీణ్, మాధవ్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి?
- ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ
- ఎయిర్ ఫ్రైర్లో వంట ఓవెన్ కంటే ఆరోగ్యకరమా? ఇది ఎలా పని చేస్తుంది?
- అడాల్ఫ్ హిట్లర్ వాచీ: రూ.30 కోట్లకు పైగా అమ్ముడవుతుందని అంచనా వేస్తే 9 కోట్లు కూడా రాలేదు.. వేలంపైనా వివాదం
- అర్జంటుగా రక్తం కావాలి, దాతలు దొరక్కపోతే ఏం చేయాలి, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చా
- భారత్లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)