శ్రీలంకలో పెట్రోల్ షార్టేజ్: గ్యాస్ కూడా.. డీజిల్ మాత్రం ఓకే..
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. దేశంలో ప్రతీ వస్తువు కొరత ఉంది. ఆర్థిక మాంద్యంతో ఆహార పదార్థాలు, గ్యాస్ సరఫరాపై కూడా ప్రభావం పడింది. నిత్యావసరాల ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగాయి. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే.
చమురు కోసం డాలర్లు చెల్లించలేదని.. గ్యాస్ కోసం క్యూ కట్టొద్దు అని శ్రీలంక ప్రభుత్వం జనాలను కోరింది. దేశానికి చమురుతో ఉన్న షిప్ ఇవాళ లేదంటే రేపు వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు 53 మిలియన్ల గ్యాసొలిన్ రుణపడి ఉంది.
దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతలా ఆర్థిక సంక్షోభం చవిచూడలేదు. ఆహారం, గ్యాస్.. అన్నీ కొరత ఏర్పడింది. వస్తువుల ధరలు 30 శాతం పెిగాయి. దేశంలో ఒకరోజు గ్యాసొలిన్ స్టాక్ నిల్వ ఉందని ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ప్రభుత్వం మూడు షిపులకు క్రూడ్ ఆయిల్ కోసం నగదు చెల్లించేందుకు సిద్దంగా ఉందని చెప్పారు.
సమాజ అభివృద్ది కోసం 160 మిలియన్ డాలర్లు వెచ్చించాలని ప్రపంచ బ్యాంకును కోరతామని తెలిపారు. ఇదీ కేవలం ఆయిల్ దిగుమతుల కోసమేనని స్పష్టంచేశారు. జూన్ నెలలో 530 మిలియన్ల ఫ్యూయల్ రిక్వైర్ మెంట్ ఉంది. ప్రస్తుతం అత్యవసరం అయిన అంబులెన్స్కోసం ఉపయోగిస్తామని చెప్పారు. అయితే డీజిల్ మాత్రం సరిపడ ఉందని మంత్రి పేర్కొన్నారు.