పోలీస్ అకాడమీలో ఉగ్రదాడి: 13మంది మృతి
మొగాదిషు: సోమాలియా రాజధాని మొగాదిషులో గురువారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక పోలీసు శిక్షణ శిబిరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడటంతో సుమారు 13 మంది మృతిచెందారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనరల్ కహియే పోలీస్ శిక్షణా కేంద్రంలో గురువారం ఉదయం పోలీస్ పరేడ్ జరుగుతుండగా శరీరానికి పేలుడు పదార్థాలు చుట్టుకున్న ఓ ఆగంతకుడు ప్రాంగణంలోకి చొరబడ్డాడు.

అనంతరం తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. గాయపడిన మరో 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
దుండగుడు పోలీస్ దుస్తుల్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించుకుంది. ఈ సంస్థ సోమాలియాలో గత కొంత కాలంగా మారణహోమాన్ని సృష్టిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications