72 ఏళ్లుగా మూసి ఉన్న గుడి..! పాకిస్థాన్ లో తెరుచుకోనున్న హిందూ మందిరం..!!
సియాలో కోట్/హైదరాబాద్ : భారత సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించిన చిహ్పాలు విశ్యవ్యాప్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆద్యాత్మితకు మారు పేరైన భారత్ లాంటి దేశంలో భక్తి భావాలకు ప్రాముఖ్యత ఎక్కువాగా ఉంటుంది. ఇందులో బాగంగా గుడులు, గోపురాలు, దేవాలయాలు ఎక్కువాగా నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రజలు కూడా హిందూ దేవుళ్ల పట్ల అపార నమ్మకంతో నిత్యం పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించి భక్తి భావాలను చాటుకుంటారు.
అఖండ భారతంగా ఉన్నప్పుడు దేశంలో ఎన్నో గుడులు గోపురాలు ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ లో పాకిస్తాన్ అంతర్బాగంగా ఉన్నప్పుడు నిర్మించిన శివాలయం ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయిన దగ్గరునుండి ఈ గుడి తలుపులు తెరుచుకోలేదు. తాజాగా ఈ గుడి నిత్యపూజలు అందుకోనుంది.

అఖంగ భారత దేశం లో హిందూ సంస్కృతి ప్రపంచం నలుదిశలూ పాకింది. హిందూ దేవాలయాలు మనదేశంలోనే కాదు పక్క దేశాల్లోనూ ఉన్నాయి. పురాతనమైన ఆ దేవాలయాల్లో భక్తులరద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయానికి మళ్లీ తెరుచుకోబోతోంది. పాకిస్థాన్ లోని సియాలో కోట్ లో ఈ పురాతన ఆలయం ఉంది. సర్దార్ తేజా సింగ్, ఈ షావాలా తేజాసింగ్ ఆలయాన్ని నిర్మించారు.
భారత్, పాక్ విభజన సమయంలో 72 ఏళ్ల క్రితం ఈ ఆలయం మూతపడింది. భారత్ లో బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం ఆపేశారు. ఈ ఆలయాన్ని మళ్లీ తెరవాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు పాక్ మీడియా వెల్లడించింది.
ఆలయంలో దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాన్ని పరిరక్షించే పనులను కూడా ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా సియాల్ కోట్ డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ మాట్లాడుతూ... ఆలయాన్ని ప్రజలు స్వేచ్ఛగా దర్శించుకోవచ్చని తెలిపారు.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ












Click it and Unblock the Notifications