న్యాయ కేంద్రంపై ఉగ్రదాడి.. 8 మంది మృతి, దాడుల వెనుక జిహాదీ గ్రూప్!
Terror Attack: ఇరాన్లోని ఆగ్నేయ నగరమైన జాహెదాన్లో శనివారం ఉదయం ఒక న్యాయ కేంద్రంపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది మరణించగా.. 13 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
న్యాయభవనంపై మెరుపుదాడి
జాహెదాన్లోని న్యాయ భవనంపై సాయుధులైన ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మరణించిన 8 మందిలో ఐదుగురు సామాన్య పౌరులు ఉండగా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్లోని న్యాయ కేంద్రంపై గుర్తుతెలియని సాయుధులు దాడి చేశారని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్లైన్ పేర్కొంది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు మరణించారని, 13 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది.

ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఉగ్రవాదులు భవనంలోకి ప్రవేశించేందుకు సందర్శకుల లాగా వేషధారణతో ప్రయత్నించారని సిస్తాన్-బలూచిస్తారన్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరి వెల్లడించారు. భద్రతా దళాలు తక్షణమే స్పందించి, వారిని అడ్డుకుని హతమార్చడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
దాడికి బాధ్యత వహించిన జిహాదీ గ్రూప్
ఈ దాడికి పాకిస్థాన్ దేశంలో స్థావరం కలిగి, ఇరాన్లో కూడా చురుకుగా ఉన్న బలూచ్ జిహాదీ గ్రూప్ జైష్ అల్-అదల్ బాధ్యత వహించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఈ సంస్థ పలు దాడులకు పాల్పడిన చరిత్ర ఉంది. తాజా దాడితో జాహెదాన్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!












Click it and Unblock the Notifications