21 మంది ప్రాణాలు తీసిన సైకో సైనికుడు హతం: కాల్చి చంపిన భద్రతా దళాలు
బ్యాంకాక్: థాయిలాండ్లో శనివారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 21 మంది ప్రజల ప్రాణాలు తీసిన సైకో సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మాను ఆదివారం ఉదయం రక్షణ దళాలు మట్టెబెట్టాయి. నఖోన్ రట్చసిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విచక్షణా రహితంగా కాల్పులు..
సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన జక్రపంత్ తొమ్మ నగరంలో తిరిగాడు. వాహనంపై వెళుతూ దారినపోయే వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత నగరంలోని టెర్మినల్ 21 మాల్లో ప్రవేశించి తన వద్ద ఉన్న మెషిన్ గన్తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

భయంతో జనం పరుగులు..
ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అనేక మందికి తుపాకీ తూటాలు తగిలాయి. దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరికి తీవ్రగాయాలపాలయ్యారు. కాల్పుల శబ్ధంతో మాల్లో ప్రజలంతా భయాందోళనతో పరుగులు తీశారు. తుపాకీ సంచరిస్తూ ఆ సైనికుడు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో కొందమందిని అతడు నిర్బంధించాడు.

సైకో సైనికుడ్ని మట్టుబెట్టిన భద్రతా దళాలు..
సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు అక్కడికి చేరుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అతని కోసం కాపుకాశారు. ఆదివారం ఉదయం సైకో సైనికుడ్ని గుర్తించి భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. దీంతో అక్కడ కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే, అప్పటికే సైకో సైనికుడి కాల్పుల్లో 21 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.

కాల్పులు జరపడానికి ఆత్రూతగా ఉన్నట్లు..
కాగా, మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉండటం గమనార్హం. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సైకో సైనికుడ్ని హతమార్చినట్లు అధికారులు, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, సైకో సైనికుడు కాల్పుల ఘటనకు పాల్పడే ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టాడు. కాల్పులు జరపడానికి వేళ్లు ఆత్రూతగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications