శ్వేత సౌధంలో 11 ఏళ్ళ బాలుడు, షాక్కు గురైన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివసిస్తున్న శ్వేత సౌధంలోకి 11 ఏళ్ళ బాలుడు అడుగుపెట్టాడు. ట్రంప్తో కలిసి ఆ బాలుడు ముచ్చటించారు. ట్రంప్కు వీరాభిమానిగా ఉన్న ఆ బాలుడి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
వాషింగ్టన్ సబర్బ్కు చెందిన పదకొండేళ్ళ ఫ్రాంక్ ఎఫ్ఎక్స్ జైక్సియా అనే 11 బాలుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ఒకరోజు శ్వేత సౌధంలో గడ్డి కత్తిరంచే పని చేయాలని ఉందన్నారు. ఈ పనిచేస్తే తనకు గౌరవంగా ఉంటుందని గత ఆగష్టులో ట్రంప్కు లేఖ రాశారు.

అయితే ఫ్రాంక్ లేఖకు స్పందించిన అధ్యక్ష భవనం పరిపాన సెక్రటరీ షారా సండెర్ అవకాశమిచ్చారు. దీంతో ఫ్రాంక్ శ్వేతసౌధంలోని రోస్గార్డెన్ లాన్లో మిషన్తో గడ్డి కత్తిరించాడు. సాధారణంగా లాన్లో గడ్డి కత్తిరించేందుకు 8 డాలర్లను తీసుకొంటారు. కానీ, ఈ డబ్బును కూడ తీసుకొనేందుకు ఆ బాలుడు ఇష్టపడలేదు. ఉచితంగానే పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తానని ఆ బాలుడు చెప్పారు.
ట్రంప్ ఆ బాలుడితో కొద్దిసేపు మాట్లాడారు. యూఎస్ నేవీలో పనిచేయాలని ఉందని ఫ్రాంక్ .. ట్రంప్కు చెప్పారు. దేశ భవిష్యతం ఇక్కడే ఉందంటూ మనం చాలా అదృష్టవంతులం అంటూ ట్రంప్ మెచ్చుకొన్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications