ఆ చర్చిలో 40వేల ఆస్థిపంజరాలు!(వీడియో)
పరాగ్వే: ఆ చర్చిని చూస్తే భయాందోళనలకు గురికావాల్సిందే. ఎందుకంటే ఆ చర్చి నిండా ఆస్థిపంజరాలే ఉంటాయి. చర్చి నిర్మాణంలో భాగమైనట్లు ఉండే ఆ ఆస్థిపంజరాలను చూస్తే ఎవ్వరైనా కొంత భయానికి గురికావాల్సిందే.
అయితే భయం కలిగించడంతోపాటు అవి ఎంతో ఆకట్టుకునేలా నిర్మాణంలో భాగం చేశారు. సుమారు 40వేల ఆస్థిపంజారాలతో నిర్మించిన ఆ చర్చిని చూడాలంటే చెక్ రిపబ్లిక్ దేశంలోని సెడ్లాక్కు వెళ్లాల్సిందే.
1278వ సంవత్సరంలో సెడ్లాక్కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం వెళ్లాడు. అతను అక్కడి మట్టిని తెచ్చి ఆ ఊళ్లో చల్లాడు. ఆ పవిత్ర స్థలం శ్మశాన వాటికగా మారింది. దీంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పుడే యూరోప్ అంతా ప్లేగ్ ప్రబలింది.

ఆ వ్యాధి వల్ల 30వేల మంది బలయ్యారు. వాళ్లను ఇక్కడే పూడ్చారు. ఆ తర్వాత మతయుద్ధాల వల్ల సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు. వాళ్లను కూడా అక్కడే పాతిపెట్టారు. కాగా, 15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం శవాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని తవ్వారు. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు.
ఆ తర్వాత స్థానిక శిల్పితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో ఎముకలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పుర్రెల దండలు చర్చి సందర్శకులను ఆహ్వానిస్తాయి. ఇక వెన్నుపూసలతో చేసిన శాండిలీర్ ఆ చర్చికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చర్చికి బోన్ చర్చి అనే పేరు కూడా ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications