ఉత్తర కొరియా వైపు అమెరికా వార్ షిప్లు
వాషింగ్టన్: కొరియన్ ద్వీపకల్పం చుట్టూ అమెరికా స్టెల్త్ బాంబర్స్తో మోహరిస్తోంది. వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో సహా నేలమీద, నీటిమీద పోరాడగల షిప్ను ఆ ప్రాంతంలో దించుతోంది.
ఇది అతి సాధారణ విషయమేనని, కేవలం భద్రతపరమైన చర్యల్లో భాగంగానే స్టెల్త్ బాంబర్స్ను రంగంలోకి దించుతున్నట్లు మిలటరీ అధికారులు చెప్పారు.

ఒలింపిక్స్ ముగిసే వరకూ ఎలాంటి యుద్ధ విన్యాసాలను నిర్వహించటం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సియోల్తో చర్చలు జరిపేందుకు అమెరికా నెమ్మదిగా చేరుతోందని ఉత్తర కొరియా చెబుతోంది.
మరోవైపు కొరియాకు చెందిన ఇరు వర్గాల నేతలు రెండో దశ చర్చలను కొనసాగిస్తున్నారు. తాజా చర్చలు సఫలమైతే ఉత్తరకొరియా ఈ గేమ్స్లో పాల్గొనడానికి మార్గం సుగమం అవుతుంది.












Click it and Unblock the Notifications