నటి, సీఎం శశికళ మృతి, బంగారం ఇలా: ఇమ్రాన్ ఖాన్ తప్పుడు ట్వీట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజకీయ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి తప్పులో కాలేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి ఓ తప్పుడు ట్వీట్ చేశారు. జయలలితను శశికళ అనుకుని ఆ ట్వీట్ చేయడం గమనార్హం.
అంతేగాక, ఆ ట్వీట్ అంతా తప్పులతడకగానే ఉంది. దక్షిణ భారత నటి, తమిళనాడు ముఖ్యమంత్రి అని శశికళను సంబోధించారు. అంతేగాక, ఇటీవలే శశికళ చనిపోయిందన్నారు. నిజానికి జయలలిత చనిపోయి సంవత్సరం దాటింది.

ఆమె ఇంట్లో బంగారం, నగలు దొరికాయంటూ ఏవో పాత బ్యాంకు దొంగతనానికి సంబంధించిన ఫొటోలతోపాటు మరికొన్ని ఫొటోలు జత చేశాడు. ఆ తర్వాత కాసేపటికి తన తప్పు తెలుసుకున్నాడో ఏమో గానీ, తనట్వీట్ను డిలీట్ చేసేశారు.
అయితే, అప్పటికే ఈ ట్వీట్ను 606మంది నెటిజన్లు రీట్వీట్ చేశారు. కాగా, ఇంతకుముందు కూడా పాకిస్థాన్ జిల్లాల విద్యా విషయంలో ర్యాంకులను కూడా ఆయన తప్పుగా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications