కాల్ గర్ల్తో ప్రేమలో పడ్డ టైగర్ మెమెన్, భార్యకూ...
ముంబై: యాకూబ్ మెమెన్ సోదరుడు, 1993 బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమెన్ ఓ కాల్ గర్ల్తో ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. అతను ఓ దశలో తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
ముంబై పేలుళ్లకు ముందు టైగర్ మెమెన్ ఎన్నో వేశ్యా గృహాలకు వెళ్లేవాడని, ఓ గృహంలో ఉన్న యువతిని ఎంతో ప్రేమించాడని, ఆమె కోసం తన స్మగ్లింగ్ వ్యాపారానికి స్వస్తి చెప్పాలని భావించినట్లు తెలుస్తోంది. టైగర్ మెమెన్ ప్రేమించిన యువతినే మరో వ్యక్తి కిషన్ కూడా కోరుకున్నాడట.
ఆమెకు, టైగర్ మెమెన్కు మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకుని ఆ మరో వ్యక్తి సజీవ దహనం చేసుకోబోయాడని, కిషన్ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకున్న ఆమె, అప్పటి నుంచి టైగర్ మెమెన్ను దూరం పెట్టిందని పేర్కొన్నారు.

1993 బాంబు పేలుళ్ల అనంతరం టైగర్ మెమెన్ ముంబై నుంచి దుబాయ్ పారిపోయారు. మార్చి 12, 1993లో ముంబై పోలీసులు వర్లీలోని ఆ కారులో బాంబులను గుర్తించారు. ఆ కారు మెమెన్ ఇష్టపడిన కాల్ గర్ల్ పేరిటే రిజిస్టరై ఉందని పేర్కొన్నారు.
పోలీసులు ఆమెను అరెస్టు చేసి, మెమెన్ గురించి సమాచారం సేకరించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ముకదమ్, షానవాజ్ ఖురేషీలను అదుపులోకి తీసుకున్నారు. ప్లాజా సనిమా వద్ద పెట్టిన బాంబు కేసులో వీరని టాడా కోర్టు దోషులుగా తేల్చింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications