చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు, హార్మూజ్ జలసంధి అంశంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. హార్మూజ్ జలసంధి తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయానికి వచ్చారు. ప్రధాని మోదీ- ట్రంప్ మాట్లాడుకున్న విషయాలను భారత్ లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ సహకరిస్తుందని పునరుద్ఘాటించారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసేందుకు భారత్ సహకరిస్తుందని అన్నారు. అయితే ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ లో సంభాషించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Received a call from President Trump and had a useful exchange of views on the situation in West Asia. India supports de-escalation and restoration of peace at the earliest. Ensuring that the Strait of Hormuz remains open, secure and accessible is essential for the whole world.…
— Narendra Modi (@narendramodi) March 24, 2026
భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అనంతరం ప్రధాని మోదీ సైతం తన అధికారిక ఎక్స్ లో ఇదే విషయంపై పోస్టు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్ని పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తమ సహకారం అందిస్తుందని అన్నారు.
President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.
— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026
ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ సపోర్ట్ చేస్తుందని అన్నారు. హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యవసరం అని దాన్ని తెరవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు అమెరికాకు టచ్ లో ఉంటామని తెలిపారు.

ఇక అమెరికాతో యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇక రోజూ భారత్ కు దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు హార్మూజ్ మీదుగానే వస్తుంది. మరోవైపు ఇరాన్ కొత్త సెక్యూరిటీ చీఫ్ గా మహ్మద్ జోల్ ఘాద్ నియామకం అయ్యారు. అంతకుముందు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ గా ఉన్న అలీ లారిజానీ దాడుల్లో హతమైన విషయం తెలిసిందే.
-
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
కుప్పకూలిన ఖతర్ హెలికాప్టర్.. !!












Click it and Unblock the Notifications