టర్కీ: అంకారాలోని ఏరోస్పేస్ సంస్థపై భారీ ఉగ్రదాడి, పలువురు మృతి
అంకారా: టర్కీలోని ఏరోస్పేస్ సంస్థపై భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ రాజధాని అంకారా శివారులో ఉన్న టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(TUSAS) ప్రధాన కార్యాలయంపై సాయుధ దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. పదుల సంఖ్యలో గాయపడినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
ఈ దాడి ఉగ్రవాదుల పనేనని మంత్రి తెలిపారు. అయితే, దాడికి ఏ ఉగ్రవాద సంస్థ పాల్పడిందనే విషయంపై స్పష్టత లేదు. అంకారా శివారులో ఉన్న టర్కిష్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీలోకి కొందు సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. భద్రతా సిబ్బంది విధులు మారుతున్న సమయంలో లోనికి ప్రవేశించారు.

ప్రవేశమార్గంలో ఓ వ్యక్తి బాంబు పేలుడుకు పాల్పడగా.. మిగితా దుండగులు లోనికి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ తర్వాత ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిపింది. ఏరోస్పేస్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని.. ఉగ్రవాదులు కంపెనీలోని సిబ్బందిని బందీలుగా చేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
"Concerned about the hostage situation in #Turkey. Thoughts with the families. Urgent action needed for a swift and peaceful resolution."#Turkey #Ankara pic.twitter.com/gtdmJisdNs
— Divyanshu Das🇮🇳 (@DivyanshuDas5) October 23, 2024
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా సిబ్బందితోపాటు అంబులెన్స్లు, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
#Shocking visuals from Ankara after deadly #TerroristAttack at #TUSAS facilities.#Terrorist are clearly visible
— Vicky Gurjar (@VeekeshGujjar) October 23, 2024
Pray for #Ankara🙏#Turkey #TerrorAttack #Russia #ViralVideos #Encounter #XiJingping pic.twitter.com/nWpl9Q0i4B
ఉగ్రదాడి ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రదాడిలో మరణించినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, దాడులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications