చైనాను విశ్వసించిన టర్కీ.. వ్యాక్సిన్ దిగుమతి.. 91 శాతం ప్రభావం..
కరోనా వైరస్ ఉనికి బయటపడింది చైనాలోని వుహాన్లో అనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కోసం రకరకాల వ్యాక్సిన్లు వస్తున్నాయి. అయితే వైరస్ ఆవిర్భవించిన చైనా నుంచి వస్తేనే బెటర్. కానీ డ్రాగన్ కంట్రీని విశ్వసించడం అంత ఈజీ కాదు. కానీ టర్కీ మాత్రం ధైర్యం చేసింది. చైనా వ్యాక్సిన్ వేయించింది.
చైనా సినొవాక్ వ్యాక్సిన్ను టర్కీలో ప్రయోగాత్మకంగా వేయించారు. అయితే 91 శాతం టీకా ఫలితం చూపించిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఫహ్రిటిన్ కోకా తెలిపారు. సినొవాక్తో పాటు ఫైజర్ 4.5 మిలియన్ డోసుల టీకా అవసరం అవుతుందని తెలిపింది.
3 మిలియన్ సినొవాక్ టీకాలను టర్కీ తీసుకుంది. వచ్చెనెలలో 50 మిలియన్ల వ్యాక్సిన్ తీసుకుంటామని తెలిపింది. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు అందజేస్తామని చెప్పారు. తొలుత చైనా వ్యాక్సిన్ ఆదివారం చేరానున్నాయని వివరించారు. పరిశీలనలో భాగంగా 7371 మందికి వ్యాక్సిన్ వేయగా.. 91.25 శాతం ప్రభావం చూపించిందని మంత్రి తెలిపారు.
రోజుకు 2 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తామని కోకా తెలిపారు. తొలుత 9 మిలియన్ల ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు. టర్కీలో 83 మిలియన్ల మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. 19 వేల 115 మంది వైరస్ సోకి చనిపోయారు.