భార్యతో వ్యభిచారం చేయించి, ఆమె ప్రేమకు బలయ్యాడు
ఇస్తాంబుల్: తను చేసిన పాపం తనకే చుట్టుకుందన్నట్లుగా ఓ భర్త చేసిన అరాచకం అతడి ప్రాణం తీసింది. డబ్బు కోసం భార్యతో వ్యభిచారం చేయించిన ఓ భర్త చివరకు ఆమె కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వ్యభిచారానికి వెళ్లిన ఆమె ఓ కస్టమర్తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు.
వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్ తురాన్(26) డబ్బు సంపాదించడానికి భార్య కాగ్లాను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దింపాడు. అంతేగాక, అతనే కస్టమర్లతో మాట్లాడి, ఎక్కువ డబ్బు ఇచ్చేవారికి భార్యను అప్పగించేవాడు.

కాగా, ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన సహిన్ అనే ఖరీదైన కస్టమర్తో కాగ్లా ప్రేమలో పడింది. దీంతో తిరిగి భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని కాగ్లా.. సహిన్ తోనే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో తన భార్య కాగ్లాను తెచ్చుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లాడు తురాన్. ఆ తర్వాత ఆమెను నిలదీశాడు. దీంతో తాను అతని వద్దే ఉంటానని తేల్చి చెప్పింది కాగ్లా. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో సహిన్, అతడి స్నేహితులు తుపాకీతో కాగ్లా భర్త తురాన్ను కాల్చి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications