ఇద్దరు పోలీసు అధికారుల హత్య
కరాచీ: గస్తి తిరుగుతున్న పోలీసు అధికారులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపి తప్పించుకుని పరారైన సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. పాకిస్థాన్ బెలూచిస్థాన్ ఫ్రావిన్స్ లోని క్వెట్టా నగరంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.
అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులు జరపడంతో ఒకరు సంఘటనా స్థలంలో, ఇంకోకరు ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. క్వట్టా లోని శాటిలైట్ సిటిలో సోమవారం రాత్రి ఇఫ్తార్ విందు ఎర్పాటు చేసిన ప్రాంతంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.

ఆ సందర్బంలో బైక్పై వెళ్తూ ఇద్దరు నిందితులు పోలీసుల మీద తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఎస్ఐ రెహమాన్ అక్కడికక్కడే మరణించాడు. మరో ఎస్ఐ హఫీజుల్లా అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై హఫీజుల్లా మరణించాడు.
పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇటివల ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 8 మంది పోలీసులు మరణించారు. అయితే దాడులకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
-
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications