ఆత్మాహుతి: 43మంది మృతి, 240మందికి గాయాలు
బీరుట్: ఆత్మాహుతి దాడులతో లెబానన్ దద్దరిల్లింది. రెండు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 43 మంది మృతిచెందారు. మరో 240మందికిపైగా గాయపడ్డారు. లెబానన్ రాజధాని బీరుట్లో ఈ జంట పేలుళ్లు జరిగాయి. షియా ఇస్లామిక్ సంస్థ హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతమైన బుర్జ్ అల్-బరాజేనే ప్రాంతాల్లో జిహాదీలు తమను తాము పేల్చుకున్నారు.
ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనంటూ సున్నీ జిహాదీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. అయితే అధికారులు దీన్ని ఇంకా దృవీకరించలేదు. బీరుట్లో 25 ఏళ్ల క్రితం ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత మొదటిసారి ఇంత భారీ స్థాయిలో విధ్వంసక బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

దాడులను ప్రధాని తమామ్ సలాం ఖండించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులన్నీ ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుర్జ్ వీధిలో ఇద్దరు సుసైడ్ బాంబర్లు చాలా సమీప ప్రాంతంలోనే తమను తాము పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
నడుముకు పేలుడు కట్టుకుని వచ్చిన ఓ జిహాదీ.. షియా మసీదు సమీపంలో పేల్చుకున్నాడు. ఆ తర్వాత మరో జిహాదీ సమీప బేకరీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆత్మాహుతికి పాల్పడాలనుకున్న మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. రెండో పేలుడు ధాటికి మూడో జిహాదీ చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications