9 మంది పాకిస్తానీయుల కాల్చివేత: తీవ్ర ఉద్రిక్తత
Iran-Pakistan crisis: ఇరాన్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత మరింత పెచ్చరిల్లింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దాడులు- ప్రతిదాడుల వ్యవహారం విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. సాధారణ ప్రజల ప్రాణాలను సైతం బలి తీసుకునే స్థాయికి చేరుకుంది.
కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్పై ఇరాన్ దాడులను చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దేశ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్, పంజ్గూర్పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి అప్పట్లో. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ ప్రాంతం జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్రబిందువుగా చెబుతుంటారు.

ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. మిస్సైళ్లను సంధించింది. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంది పాకిస్తాన్. ఇరాన్పై ప్రతిదాడులను జరిపింది. దీనితో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
తాజాగా- ఇరాన్లోని సరావన్ టౌన్లో నివసిస్తోన్న తొమ్మది మంది పాకిస్తానీయులను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. వారందరూ రోజువారీ కార్మికులు. జీవనోపాధి కోసం ఇరాన్కు వెళ్లిన వలస కార్మికులు. స్థానికంగా ఉండే ఓ కార్ మెకానిక్ షెడ్లో పని చేస్తుండేవారు. సరావన్కు ఇరాన్ దేశస్తుడొకరు వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు.
ఈ ఘటనను ఇరాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నిర్ధారించింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఆ కుటుంబాల వారిని ఆదుకుంటామని పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ముదస్సిర్ టిపు చెప్పారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
LPG Cylinder: బ్లాక్ లో 1500 దాటేసిన గ్యాస్ సిలెండర్ ? చాపకింద నీరులా వార్ ఎఫెక్ట్..! -
ఇరాన్ యుద్ధం: 67,000 మంది భారతీయులు స్వదేశానికి.. -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..! -
అట్టుడికిపోతున్న టెహ్రాన్.. ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై దాడులతో ఇంధనం ధరలకు రెక్కలు! -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications