అధ్యక్ష ఎన్నికల వేళ..కలకలం: జార్జియాలో హైదరాబాదీ దారుణహత్య: కత్తిపోట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముంగిట కలకలం చెలరేగింది. జార్జియాలో నివాసం ఉంటోన్న హైదరాబాదీ వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తలు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జార్జియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల కోలాహలంలో మునిగివున్న వేళ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
హతుడి పేరు మహ్మద్ ఆరిఫ్ మొహినుద్దీన్. వయస్సు 37 సంవత్సరాలు. భార్య మెహనాజ్ ఫాతిమా, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ చంచల్గూడలో వారు నివసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట మొహియుద్దీన్ అమెరికాకు వెళ్లారు. జీవనోపాధి కోసం మొహియుద్దీన్ జార్జియాలో సూపర్ మార్కెట్ను నడుపుతున్నారు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ విషయాన్ని జార్జియా పోలీసులు మొహియుద్దీన్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అత్యవసర విసాపై అమెరికా వెళ్లడానికి అనుమతి ఇచ్చేలా చర్యలను తీసుకోవాలని మెహనాజ్ ఫాతిమా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకూ వినతిపత్రాన్ని పంపించారు. చివరిచూపును చూడటానికి వీలు కల్పించాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ ఆమె కుటుంబానికి అండగా నిలిచారు.
.@DrSJaishankar Mohammed Arif Mohiuddin from Hyderabad stabbed to death in Georgia,Atlanta,USA.Ask @IndianEmbassyUS & @CGI_Atlanta to contact the family & help them, Req @USAndHyderabad to provide emergency visa to them. @KTRTRS @sushilrTOI @PramodChturvedi @BTR_KTR pic.twitter.com/rwZRCzqZD3
— Amjed Ullah Khan MBT (@amjedmbt) November 3, 2020
మొహియుద్దీన్ ఫొటో, పాస్పోర్ట్, ఇతర వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాన్ని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని అమెరికా ఏంబసీకి ట్యాగ్ చేశారు. జార్జియా ఆసుపత్రిలో అనాథగా తన భర్త మృతదేహం ఉందని మెహనాజ్ ఫాతిమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, అమెరికా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications