4నెలల కూతురిపై 22సార్లు పిడిగుద్దులతో చంపేశాడు
చికాగో: అమెరికాలో దారుణం జరిగింది. టీవీ చూస్తుండగా శబ్ధం చేస్తుందని తన నాలుగు నెలల చిన్నారి పైన 22 పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చికాగోలో చోటు చేసుకుంది.
చికాగోకు చెందిన కోరీ మోరిస్కు నాలుగు నెలల కుమార్తె ఉంది. తన భార్య ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లింది. చిన్నారిని భర్త కోరీ మోరిస్ వద్ద ఉంచింది. కోరీ మోరిస్ టీవీ చూస్తుండగా ఆ చిన్నారి పక్కనే ఆడుకుంటూ శబ్ధాలు చేసింది.
దీంతో ఆగ్రహం చెందిన కోరీ మోరిస్.. పాపను మరో గదిలోకి తీసుకు వెళ్లి మాట్లాడకుండా చేసే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పాప ముఖం పైన, ఛాతి పైన 22సార్లు పిడిగుద్దులు కురిపించాడు. వాటిని తట్టుకోలేక ఆ పాప చనిపోయింది. పోలీసులు అతనిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. తన భర్త గతంలోను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని భార్య తెలిపింది. అతని మానసిక పరిస్థితి సరిగా ఉండదని చెప్పింది.