ఆ ట్రాప్ లో పడితే ఇండియాకు నష్టమేనంటూ చైనా హెచ్చరిక
తమను కట్టడి చేసేందుకు అమెరికా , జపాన్ లకు ఇండియా పావుగా మారకూడదని చైనా ఆరోపించింది. ఈ మేరకు చైనా తన అధికారిక పత్రికలో వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించింది.
బీజింగ్: తమను కట్టిడి చేసేందుకు అమెరికా, జపాన్ ప్రయత్నిస్తున్నాయని చైనా ఆరోపించింది.ఇందుకోసం భారత్ ను పావుగా వాడుకొంటున్నాయని చైనా విమర్శలు చేసింది.
చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లోని ఎడిటోరియల్ కాలమ్ లో ఈ మేరక్ చైనా ఒక అధికారిక వ్యాసాన్ని రాసింది. అమెరికా, జపాన్ ట్రాప్ లో చిక్కితే భారత్ కే ముప్పు ఎక్కువని సమస్యలు ఉత్పన్నమౌతాయని చైనా హెచ్చరించింది.
ఈ మేరకు భారత్ ను ఉపయోగించుకొనేందుకు కుట్రలు చేస్తోందని చైనా విమర్శించింది.హిందూ మహసముద్రంపై చైనాను కట్టడి చేసేందుకు అమెరికా డిల్లీని ఉపయోగించుకోవాలని చూస్తోందని చైనా విమర్శలు గుప్పించింది.
ఫసిఫిక్ సముద్రంపై తమ దేశంతో పాటు సమానంగా సాగాలని భావిస్తూ డిల్లీ సహయం తీసుకోవాలని భావిస్తోందని చైనా అభిప్రాయపడిందంటూ గ్లోబల్ టైమ్స్ వ్యాసంలో చైనా ఆరోపణలు చేసింది.
భారత్ కు వ్యూహత్మక అవకాశాలుగా కన్పిస్తాయి, కానీ వాస్తవానికి దీని వెనుక పెద్ద మాయాజాలం ఉందని చైనా ఆరోపణలు చేసింది. ఒక్కసారి భారత్ ఆ ట్రాప్ లో పడితే అమెరికా ఆడే చదరంగంలో భారత్ పావుగా మారే అవకాశం ఉందన్నారు.దీని వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోవడంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని చైనా అభిప్రాయపడింది.