వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బారిన పడిన పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్: అందరూ క్షేమంగా ఉండాలని..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే అతడు తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నారు.

బంగారు పతక విజేత అయిన ఉసేన్ బోల్డ్ కరోనా పాజిటివ్ గా తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని సమాచారం. ఇటీవల అతడు తన 34 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇందులో ప్రముఖులతోపాటు చాలా మంది పాలుపంచుకున్నారు.

 Usain Bolt tests positive for COVID-19 after celebrating birthday in Jamaica

అయితే, ఆగస్టు 21న జరిగిన ఈ పార్టీలో ఎవరూ మాస్కులు కూడా పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు. వారిలో కొందరు సెల్ఫ్ క్వారంటైన్ ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

తాను కరోనా బారిన పడ్డానని చెప్పిన ఉసేన్ బోల్ట్.. తాను బాధ్యతగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా సోకిన నేపథ్యంలో తాను సెల్ఫ్ హోంక్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపారు. అంతేగాక, తనను అభిమానించేవారంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.

English summary
Usain Bolt, the eight-time Olympic gold-winning sprinter, confirmed on Monday that he has tested positive for coronavirus after partying with friends in Jamaica on his 34th birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X