క్రిస్మస్ వేళ పేలుడు: దద్దరిల్లిన అమెరికా, ముగ్గురికి గాయాలు.. ఉగ్రవాద చర్యేనా..?
క్రిస్మస్ వేళ అందరూ సంబరాల్లో మునిగితేలారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. బయటకి వచ్చి చూసేసరికి కారు తునతునాకలై కనిపించింది. అమెరికాలోని నాష్విల్లేలో గల డౌన్ టౌన్లో నడిరోడ్డుపై పార్క్ చేసి ఉన్న కారు దగ్ధం కావడంతో.. పండగ వేళ అక్కడున్న జనం కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు.
ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించామని వివరించారు. కారును ఎవరో ఉద్దేశపూర్వకంగా పేల్చివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని వారు తెలిపారు.
అక్కడ ఉన్న కారుపై స్థానికులు అనుమానంతో ఉన్నారు. బాండ్ స్క్వాడ్ను కూడా పిలిచారు. స్వ్కాడ్ సిబ్బంది దారిలో ఉండగా.. కారు పేలిపోయింది. పేలుడుపై విచారణ జరుపుతున్నామని.. ఉగ్రవాద చర్య అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పేలుడుకు కొద్ది సేపు ముందు పోలీసులు ఇంటింటికీ వెళ్లి మరీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతలో కారు దగ్గరగా డాగ్ వచ్చిందని.. వెళ్లేలోపే పేలిందని తెలిపారు. కారు పేలిన సమయంలో సమీపంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.