విజయ్ మాల్యాకు భారీ ఎదురుదెబ్బ -యూకే కోర్టులో ఎస్బీఐకి అనుకూల తీర్పు -ఆస్తుల వేలానికి లైన్ క్లియర్
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడింది.
ఇండియాలోని మాల్యా ఆస్తులపై తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దివాలా పిటిషన్లో దీనికి సంబంధించిన సవరణలు చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం మాల్యాకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఓ అడుగు ముందుకు పడినట్లయింది.
రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్లో సంచలన దృశ్యాలు
ఇండియన్ బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా చీఫ్ ఇన్సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు (ఐసీసీ) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ తీర్పు చెప్పారు. తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడాన్ని నిరోధించే పబ్లిక్ పాలసీ ఏదీ లేదన్నారు. మాల్యా దివాలా తీసినట్లుగా ఆదేశాలు ఇవ్వడానికి మద్దతుగా, వ్యతిరేకంగా జూలై 26న తుది వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
మాల్యా కేసుకు సంబంధించిన విచారణలు వర్చువల్ పద్ధతిలో సాగాయి. కేసులను, వివాదాన్ని ప్రజలు మర్చిపోయే వరకు సాగదీయాలని మాల్యా ప్రయత్నిస్తున్నారని బ్యాంకులు ఆరోపించాయి. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్ను పరిష్కరించాలని కోర్టును కోరాయి. జస్టిస్ బ్రిగ్స్ ఇచ్చిన తీర్పులో, బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ను సవరించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
మళ్లీ బహిష్కరణ బాటలో చంద్రబాబు -అసెంబ్లీ బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం -జగన్ సర్కారు కూలుతుందనే..
''దివాలా ఆదేశాలు జారీ అయ్యే సందర్భంలో, తమకుగల సెక్యూరిటీని అమలు చేసే హక్కుగల పిటిషనర్లు (బ్యాంకులు), దివాలా తీసినవారి రుణదాతలందరి ప్రయోజనం కోసం అటువంటి ఏదైనా సెక్యూరిటీని వదులుకోవడానికి అంగీకరిస్తున్నారు'' అని సవరించేందుకు అనుమతిస్తున్నట్లు తీర్పు చెప్పారు. పిటిషనర్లు తమ సెక్యూరిటీని వదులుకోవడాన్ని నిరోధించే చట్టపరమైన నిబంధనలేవీ లేవని ఈ తీర్పులో పేర్కొన్నారు.